భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి
ABN , First Publish Date - 2022-11-30T00:08:09+05:30 IST
జిల్లా వ్యాప్తంగా శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం మహాగణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ, అభిషేకం, అర్చన, అష్టోత్తర శతనామార్చాన, సహస్త్రనామార్చాన, సేవ, జపం, విశేషపూజలు నిర్వహించారు. శ్రీకాకుళంలోని సంతోషిమాత ఆలయం వద్ద, నక్కవీధిలో శ్రీఉమాజఠలేశ్వరాలయం, కోటేశ్వరాలయ ప్రాంగణంలో స్వామివారి కి పూజలు నిర్వహించారు. ఇచ్ఛాపురం మం డలం బెల్లుపడ శివానంద గరి కొండపై, పలాస, నరసన్నపేట, పోలాకి, మందస, టెక్కలి జలుమూరు తదితర చోట్ల పూజలు చేపట్టారు.
- ఆంధ్రజ్యోతి బృందం