Srikakulam: వరహాల గెడ్డలో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-10-06T16:35:02+05:30 IST
పలాస మండలం, కంబిరిగాం వరహాలు గెడ్డలో కేదారిపురం గ్రామానికి చెందిన పాడి శంకర్, బోడసింగి కూర్మారావు బుధవారం సాయంత్రం గల్లంతయ్యారు.
శ్రీకాకుళం జిల్లా (Srikakulam Dist.): పలాస మండలం, కంబిరిగాం వరహాలు గెడ్డలో కేదారిపురం గ్రామానికి చెందిన పాడి శంకర్, బోడసింగి కూర్మారావు బుధవారం సాయంత్రం గల్లంతయ్యారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరహాల గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో వారు స్నానాలకు దిగగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. తోటి స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నం చేసిన ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని పర్యవేక్షించారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చెపట్టారు. రాత్రి కావడంతో తిరిగి గురువారం ఉదయం గాలింపు చర్యలు చెపట్టారు. గల్లంతైన ఇద్దరిలో శంకరరావు మృతదేహం లభ్యమైంది. కూర్మారావు మృతదేహం కోసం గాలిస్తున్నారు.