సమయపాలన పాటించాలి

ABN , First Publish Date - 2022-12-06T23:37:05+05:30 IST

ర్బీకే సిబ్బంది సమయపాలన పాటించాలని ఏపీడీడీసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎ.బాబు ఆదేశించారు. మంగళవారం బూర్జ మండలంలోని పాలవలస రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌లో కలిసి పరిశీలించారు.

  సమయపాలన పాటించాలి

శ్రీకాకుళం (బూర్జ): ఆర్బీకే సిబ్బంది సమయపాలన పాటించాలని ఏపీడీడీసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎ.బాబు ఆదేశించారు. మంగళవారం బూర్జ మండలంలోని పాలవలస రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌లో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేదని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా నేరుగా వారి వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బొడ్డేపల్లి రాజేశ్వరమ్మ, తహసీల్దార్‌ రమణారావు, డీటీ సంతోష్‌కుమార్‌, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:37:07+05:30 IST