అంచనాలు సిద్ధంచేయండి: స్పీకర్
ABN , First Publish Date - 2022-04-25T05:07:09+05:30 IST
వెంకయ్యపేటలో పాఠశాల భవనం మరమ్మతుకు నాడు-నేడు భాగంగా అంచనాలు సిద్ధంచేయాలని, కమ్యూనిటీ భవనానికి ప్రతిపాదనలు తయారుచేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు.
ఆమదాలవలస: వెంకయ్యపేటలో పాఠశాల భవనం మరమ్మతుకు నాడు-నేడు భాగంగా అంచనాలు సిద్ధంచేయాలని, కమ్యూనిటీ భవనానికి ప్రతిపాదనలు తయారుచేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. ఆదివారం ము నిసిపాలిటీలోని 23వ వార్డులోని వెంకయ్యపేటలో స్పీకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పఽథకం అమలుచేయాలని చేనేత కార్మికులు సీతారాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్, బి.రమేష్కుమార్, బొడ్డేపల్లి ఏకాశమ్మ, బి.రాజులు పాల్గొన్నారు.