‘నమ్మి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు’

ABN , First Publish Date - 2022-12-04T23:56:37+05:30 IST

ప్రతిసారి నమ్మి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అన్నారు. ఆదివారం ఎల్‌ఎన్‌పేట పంచాయతీలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

‘నమ్మి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు’
ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి

ఎల్‌ఎన్‌పేట: ప్రతిసారి నమ్మి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అన్నారు. ఆదివారం ఎల్‌ఎన్‌పేట పంచాయతీలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క చాన్స్‌ అంటూ ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. భూములను కాజే సేందుకే మూడు రాజధానుల పేరిట నాటకం ఆడుతోంది ఆరోపించారు. ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు అంతం అవుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా మోసం చేసిందో ఇంటింటికీ వెళ్లి వివరించారు. రానున్న ఎన్నికల్లో చంద్ర బాబునాయుడును సీఎంగా చేసేందుకు అందరూ పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో నేతలు ఒమ్మి ఆనందరావు, చింతాడ శ్రీనివాసరావు, శివ్వాల కిశోర్‌బాబు, యంబరాం సర్పంచ్‌ వెలమల గోవిందరావు, చిరంజీవి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:56:39+05:30 IST