ఇసుక ర్యాంపుల నిర్వహణపై పరిశీలన
ABN , First Publish Date - 2022-11-02T23:28:41+05:30 IST
కోరాడ రెవెన్యూ పరిధి వంశధార నది ప్రాంతాన్ని మైనింగ్ అధికారులు బుధవారం పరిశీలించారు.
హిరమండలం: కోరాడ రెవెన్యూ పరిధి వంశధార నది ప్రాంతాన్ని మైనింగ్ అధికారులు బుధవారం పరిశీలించారు. జియాలిజిస్టు వెంకటరత్నం, మైనింగ్ సిబ్బంది సత్యం, వీర్వోలు ఇందుశేఖర్, ఈశ్వరరావు, వంశధార అధికారులతో పలు చోట్ల ఇసుక ర్యాంపుల నిర్వహణకు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ర్యాంపు నిర్వహణకు అనుకూలంగా లేదని వారు మైనింగ్ అధికారులు తెలిపారు. నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.