‘వైసీపీ పాలనలో హంగులే తప్ప అభివృద్ధి శూన్యం’

ABN , First Publish Date - 2022-12-09T23:35:35+05:30 IST

వైసీపీ అసమర్థ పాలనలో హంగులే తప్ప అభివృద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. వెంకటాపురం గ్రామంలో శుక్రవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

 ‘వైసీపీ పాలనలో హంగులే తప్ప అభివృద్ధి శూన్యం’
వెంకటాపురంలో ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

సారవకోట (జలుమూరు): వైసీపీ అసమర్థ పాలనలో హంగులే తప్ప అభివృద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. వెంకటాపురం గ్రామంలో శుక్రవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలను రప్పించి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీసీలకు ఏవ చేశారని బీసీ గర్జన సభ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు ధర్మాన తేజకుమార్‌, సురవరపు తిరుపతిరావు, బైరి భాస్కరరావు, పట్ట ఉమామహేశ్వరరావు, ఇస్సై నాగరాజు, తాడేల భీమారావు, సాధు చిన్నికృష్ణంనాయుడు, కొర్ను హేమంత్‌ పాల్గొన్నారు. అలాగే కూర్మ నాథపురం లో టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి బగ్గు గోవిందరావు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రా నికి కార్యక్రమం నిర్వ హించారు. పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:35:37+05:30 IST