కోర్టు భవనాన్ని మార్చాలంటూ న్యాయవాదుల రిలే దీక్ష
ABN , First Publish Date - 2022-11-30T23:30:20+05:30 IST
థిలావస్థలో ఉన్న కోర్టు భవనాన్ని మార్చాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్క రించి కోర్టు ఎదుట దీక్షలు కొనసాగించారు.
టెక్కలి: శిథిలావస్థలో ఉన్న కోర్టు భవనాన్ని మార్చాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్క రించి కోర్టు ఎదుట దీక్షలు కొనసాగించారు. ఈ భవనాన్ని మార్చాలని హైకోర్టు ఆదేశాలి చ్చినా జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని, దీంతో ఈ భవనంలో విధులు నిర్వహిం చలేమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ధర్మరాజు అన్నారు. న్యాయవాదులు పైల అరు ణ్కుమార్, దాడి ధర్మారావు దీక్షలో పాల్గొనగా వీరికి సీనియర్ న్యాయవాదులు దివ్వల వివే కానంద, బెండి గౌరీపతి, పేడాడ బాబూరావు, తదితరులు సంఘీభావం తెలిపారు.