ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2022-11-30T23:34:41+05:30 IST
ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ ఎం.నర్సింహ మూర్తి సూ చించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో మండలంలోని పలు ఆలయాల అర్చకులతో సమా వేశం నిర్వహించారు.
పోలాకి: ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ ఎం.నర్సింహ మూర్తి సూ చించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో మండలంలోని పలు ఆలయాల అర్చకులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగల బెడద ఉందని, ఇటీవల వెదుళ్లవలస శివకేశవ ఆలయంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఆభరణాలను ఆలయాల్లో ఉంచవద్దన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆలయంలోని దేవుని బంగారం, వెండి, నగదును భద్ర పరిచే బాధ్యత అర్చకుల దేనన్నారు.