వైసీపీకి మరోసారి అధికారం ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2022-12-04T23:55:08+05:30 IST

వైసీపీకి మరోసారి అధికారం ఇవ్వొద్దని, ఈసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల గోడు పట్టించుకునే నాథుడే ఉండరని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని గుడి వీధిలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.

 వైసీపీకి మరోసారి అధికారం ఇవ్వొద్దు
గుడివీధిలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే లక్ష్మీదేవి

శ్రీకాకుళం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి మరోసారి అధికారం ఇవ్వొద్దని, ఈసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల గోడు పట్టించుకునే నాథుడే ఉండరని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని గుడి వీధిలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజ లకు ఎన్నికల ముందు హామీలిచ్చేసి.. ఇప్పుడు పరదాల వెనుక వస్తున్నా రని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని... టీడీపీ ఈ దఫా అధికారంలోకి రాకుంటే నష్టం వాటిల్లేది ప్రజలకేనని చెప్పారు. కార్య క్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు శిల్లా శ్రీనివాసరావు, జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ముబారక్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:55:09+05:30 IST