వైసీపీ పాలనతో అధోగతి
ABN , First Publish Date - 2022-12-09T23:37:21+05:30 IST
వైసీపీ పాలనతో రాష్ట్రానికి అధోగతి పట్టిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు. శుక్రవారం మండపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.
కంచిలి, డిసెంబరు 9: వైసీపీ పాలనతో రాష్ట్రానికి అధోగతి పట్టిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు. శుక్రవారం మండపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో రాష్ట్రం ఎడారిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫ ల్యాలను వివరించారు. కార్యక్రమంలో కురయ్య, కామేష్, శ్రీను, పూర్ణ, హరి బాబు, రామారావు, ఎస్.కామేష్ తదితరులు పాల్గొన్నారు.