ధాన్యం కొనుగోలు చేయండి: జేసీ

ABN , First Publish Date - 2022-12-13T23:48:38+05:30 IST

ఆర్బీకేల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జేసీ ఎం.నవీన్‌కుమార్‌ ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు చేయండి: జేసీ

ఆమదాలవలస: ఆర్బీకేల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జేసీ ఎం.నవీన్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం మండలంలోని సైలాడ రైతు భరోసా కేంద్రం, పురపాలక సంఘం పరిధిలోని మోనంగివీధి వార్డు సచివాలయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని మోనంగివీధి సచివాలయాన్ని సందర్శించారు. చింతాడ సంత మైదానం, మెట్టక్కివలస ప్రాంతం సర్వేనెంబర్‌ 196/12లో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి స్థలం కేటాయించాలని పురపాలక సంఘం అధికారులు జేసీని కోరారు. దీంతో స్థలాన్ని పరిశీలించి 12 సెంట్లు చొప్పున కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సుగుణాకరరావు, ఏవో మెట్ట మోహనరావు, డీటీ ఎస్‌.రాంబాబు, సీఎస్‌ డీటీ డి.అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:48:39+05:30 IST