AP News: అలా ఏ టీడీపీ నాయకుడు మాట్లాడినా సస్పెండ్ చేస్తాం: బుద్ద వెంకన్న
ABN , First Publish Date - 2022-09-16T02:40:55+05:30 IST
Srikakulam: ‘అమరావతే రాష్ట్ర రాజధాని. టీడీపీ (TDP) అందుకు కట్టుబడి ఉంది. అలాకాకుండా మూడు రాజధానులకు అనుకూలంగా ఏ టీడీపీ నాయకుడైనా మాట్లాడినా లేక మద్దతు తెలిపినా పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేస్తామని టీడీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్ద వెంకన్న (Budda Venkanna) హెచ్చరించారు. శాసనసభలో సీఎం జగన్ పాలన వికేంద్రీకరణపై చేసిన ప్రసంగంపై టీడీపీ
Srikakulam: ‘అమరావతే రాష్ట్ర రాజధాని. టీడీపీ (TDP) అందుకు కట్టుబడి ఉంది. అలాకాకుండా మూడు రాజధానులకు అనుకూలంగా ఏ టీడీపీ నాయకుడు మాట్లాడినా లేక మద్దతు తెలిపినా పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేస్తామని టీడీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్ద వెంకన్న (Budda Venkanna) హెచ్చరించారు. శాసనసభలో సీఎం జగన్ పాలన వికేంద్రీకరణపై చేసిన ప్రసంగంపై టీడీపీ నేతలు స్పందించారు. ఈ సందర్భంగా బుద్ద వెంకన్న మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు జగన్ అమరావతికి మద్దతు తెలిపారు. జగన్ చేతిలో చిల్లిగవ్వ లేదు, అభివృద్ధి చేసే మనసు లేదు. అమరావతిలో ఒక్క ఇటుక పెట్టలేదు గాని.. మూడు రాజధానులు కడతాం అంటున్నారు. మూడు రాజధానుల పేరిట దొంగనాటకాలు కట్టిపెట్టి.. విశాఖ, విజయనగరం శ్రీకాకుళం, కర్నూలును అభివృద్ధి చేసి చూపించాలని’’ సవాల్ విసిరారు.