రెయ్యమ్మ జాతరలో అచ్చెన్న
ABN , First Publish Date - 2022-11-16T23:32:29+05:30 IST
సవరపేటలో బుధవారం జరిగిన రెయ్యమ్మ జాతర లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంతబొమ్మాళి: సవరపేటలో బుధవారం జరిగిన రెయ్యమ్మ జాతర లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీకమాసం మూడో సోమ వారం నుంచి మూడు రోజల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తుండడం ఆన వాయితీ. అచ్చెన్న వెంట జిల్లా తెలు గు యువత అధ్యక్షుడు మెండ దాసు నాయుడు, కోటబొమ్మాళి పీఏసీయస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు,రెడ్డి అప్పన్న, కో-ఆర్డినేటర్లు అప్పిని వెంకటేష్, బెండి అరుణ్కుమార్ పాల్గొన్నారు.