ధాన్యం రవాణా చార్జీల పేరుతో రూ.వంద కోట్లు పంచుకున్నారు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-02-20T01:31:34+05:30 IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రవాణా చార్జీల నెపంతో మిల్లర్లు, అధికారులు రూ.వంద కోట్లు పంచుకున్నారు.

ధాన్యం రవాణా చార్జీల పేరుతో రూ.వంద కోట్లు పంచుకున్నారు: సోము వీర్రాజు

శ్రీకాకుళం: ‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రవాణా చార్జీల నెపంతో మిల్లర్లు, అధికారులు రూ.వంద కోట్లు పంచుకున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు మూలకు చేరాయి. ఫలితంగా పొలాలు ఉన్నా.. రైతులు ఢిల్లీ వరకు వలస పోతున్నారు’ అని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శనివారం శ్రీకాకుళంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దళారులకు, మిల్లర్లకు వత్తాసు పలుకుతున్న పౌరసరఫరాల శాఖను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న నీటి వనరులు సద్వినియోగం కావడం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు..  కేవలం రూ.4 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టుల కోసం పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్ల మోసాలను ఆపలేని పౌరసరఫరాల శాఖను రద్దు చేయాలని సోము డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాల చర్చల్లో విభజన అంశాన్ని పొరపాటున పెట్టారని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-02-20T01:31:34+05:30 IST