Shailajanath: తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది..

ABN , First Publish Date - 2022-09-11T17:56:56+05:30 IST

కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

Shailajanath: తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది..

అమరావతి (Amaravathi): ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju) మరణంతో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) అన్నారు. కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సినిమాలలో నటుడిగా, విలన్‌గా, హీరోగా విభిన్న పాత్రలతో కృష్ణంరాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. అందరితో సన్నిహితంగా ఉంటూ అజాత శత్రువుగా పేరు సంపాదించారని కొనియాడారు. కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారన్నారు. కృష్ణంరాజు మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన తరఫున, కాంగ్రెస్ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు శైలజానాథ్ అన్నారు. 

Updated Date - 2022-09-11T17:56:56+05:30 IST