ఎదురెదురుగా ఢీకొన్న రెండు ఆటోలు..ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-09-07T12:41:37+05:30 IST

ఫిరంగిపురం మండలం తకెళ్లపాడు దగ్గర తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఆటోలు

ఎదురెదురుగా ఢీకొన్న రెండు ఆటోలు..ఒకరు మృతి

పల్నాడు జిల్లా: ఫిరంగిపురం మండలం తకెళ్లపాడు దగ్గర తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-07T12:41:37+05:30 IST