-
-
Home » Andhra Pradesh » Revenue deficit of Rs 879 crore released to AP-NGTS-AndhraPradesh
-
ఏపీకి రెవెన్యూ లోటు 879 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2022-06-07T10:00:23+05:30 IST
ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.879.08 కోట్లను విడుదల చేసింది.

న్యూఢిల్లీ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.879.08 కోట్లను విడుదల చేసింది. నిధుల పంపిణీ తర్వాత (పోస్ట్ డెవల్యూషన్) ఏర్పడ్డ లోటు భర్తీకి 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు మేరకు జూన్ నెల గ్రాంట్ను విడుదల చేసినట్లు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రూ.2637.25 కోట్లు విడుదల చేశామని పేర్కొంది. కాగా, జూన్ నెల లోటుకు సంబంధించి 14 రాష్ట్రాలకు కలిపి ఆర్థిక శాఖ రూ.21550.25 కోట్లు విడుదల చేసింది.