కొత్త.. కొత్తగా..!

ABN , First Publish Date - 2022-04-05T10:21:09+05:30 IST

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆర్డర్‌ టూ సర్వ్‌ కింద పాత జిల్లా కార్యాలయాల్లోని రెగ్యులర్‌ సిబ్బందిని కొత్త, పాత..

కొత్త.. కొత్తగా..!

రెగ్యులర్‌ సిబ్బంది సర్దుబాటు

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆర్డర్‌ టూ సర్వ్‌ కింద పాత జిల్లా కార్యాలయాల్లోని రెగ్యులర్‌ సిబ్బందిని కొత్త, పాత జిల్లాలకు సర్దుబాటు చేశారు. మార్కెటింగ్‌ శాఖ తరఫున పాత జిల్లాలకు సహాయ సంచాలకుల(ఏడీ)ను, కొత్త జిల్లాలకు సీనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్ల(ఎ్‌సఎంఏ)ను జిల్లా అధికారులుగా నియమించారు. ప్రస్తుతానికి రెగ్యులర్‌ సిబ్బందిని మాత్రమే కొత్త, పాత జిల్లాలకు సర్దుబాటు చేశారు. అలాగే విజయనగరం, ఏలూరు, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురంలో ఉద్యానశాఖ ఉపసంచాలకుల (డీడీ)ను కొనసాగిస్తూ, మిగతా జిల్లాలకు సహాయ సంచాలకుల (ఏడీ)ను నియమించారు. రెగ్యులర్‌ సిబ్బందిని కూడా సర్దుబాటు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రంలో జిల్లా విద్యాశాఖాధికారులను సర్దుబాటు చేశారు. మొత్తం 26జిల్లాల్లోను విద్యాశాఖాధికారులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. గృహనిర్మాణశాఖలో ప్రభుత్వం తాత్కాలికంగా కొత్త జిల్లా అధికారులను నియమించింది. ఇప్పటివరకూ జిల్లా హౌసింగ్‌ అధికారులు ప్రాజెక్టు డైరెక్టర్లుగా ఉండగా ఆ పేరును ‘జిల్లా హౌసింగ్‌ హెడ్‌’గా మార్చింది. తాత్కాలికంగా కొత్త జిల్లాలకు ఎస్‌ఈలు, ఈఈలను ఇన్‌చార్జ్‌ జిల్లా అధికారులుగా నియమిస్తూ హౌసింగ్‌ ఎండీ భరత్‌ గుప్తా ఆదేశాలిచ్చారు.


Updated Date - 2022-04-05T10:21:09+05:30 IST