సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ర్టేషన్లు
ABN , First Publish Date - 2022-11-02T06:33:10+05:30 IST
ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్లతో పాటు, గ్రామ, వార్డు కార్యదర్శులకు
గ్రామ,వార్డు సెక్రెటరీలకూ ఆ అధికారం
సర్కారు మెమో.. వ్యాజ్యం పరిష్కారం
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్లతో పాటు, గ్రామ, వార్డు కార్యదర్శులకు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న అధికారాలు తొలగించలేదని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో మెమో దాఖలు చేసింది. ఆ వివరాలు నమోదు చేసిన ధర్మాసనం.... ప్రభుత్వం మెమో రూపంలో అందజేసిన వివరాలపై పిటిషనర్ సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వ్యాజ్యంపై విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. పిటిషన్ను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్ట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. అంతకుముందు.. పిటిష నర్ అయిన ఎన్టీఆర్ జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామప్రసాద్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్కుమార్ వాదనలు వినిపించారు.