Dawleswaram: గోదావరికి వరద ఉధృతి..రెండో ప్రమాద హెచ్చరిక
ABN , First Publish Date - 2022-08-17T03:43:52+05:30 IST
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతోంది. దీంతో...
రాజమండ్రి (Rajahmundry): ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ (Dawleswaram Cotton Barrage) వద్ద గోదావరి (Godavari)కి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 14 అడుగులకు చేరింది. మొత్తం 175 గేట్లు ఎత్తివేశారు. 13.20 లక్షల క్యూసెక్కుల వరద నీరును సముద్రంలోకి విడుదల చేశారు. అటు విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజ్ వేలపై వరద నీరు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజలు నాటుపడవలపై ప్రయాణం సాగిస్తున్నారు.