క్విస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ కల్యాణచక్రవర్తికి ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN , First Publish Date - 2022-09-19T10:00:02+05:30 IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ నిడమానూరి కల్యాణ చక్రవర్తికి బ్రిటన్‌కు చెందిన వరల్డ్‌

క్విస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ కల్యాణచక్రవర్తికి ప్రతిష్ఠాత్మక అవార్డు

ఒంగోలు (విద్య), సెప్టెంబరు 18: ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ నిడమానూరి కల్యాణ చక్రవర్తికి బ్రిటన్‌కు చెందిన వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ డ్రైవ్‌ (డబ్ల్యూహెచ్‌డీ) సంస్థ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన సమ్మిట్‌లో సంస్థ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ అబ్దుల్‌ బాసిత్‌ సయ్యద్‌, ఇతర అతిథులు ఈ అవార్డును కల్యాణచక్రవర్తికి ప్రదానం చేశారు. కల్యాణ చక్రవర్తి అమెరికాలోని ఇంజనీరింగ్‌ సొసైటీ ఆఫ్‌ డెట్రాయిట్‌-మిచ్‌గన్‌లో సభ్యులుగా ఉన్నారు. శ్రీ నిడమానూరి ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించి ఇంజనీరింగ్‌ కళాశాల, కాలేజీలు, స్కూళ్లు నడుపుతున్నారు. విద్యతో పాటు, సామాజిక అవసరాలపై అవగాహన కల్పిస్తున్నారు. వీటన్నింటినీ గుర్తించిన డబ్ల్యూహెచ్‌డీ కల్యాణ చక్రవర్తికి ఈ అవార్డును ప్రదానం చేసింది. 

Updated Date - 2022-09-19T10:00:02+05:30 IST