విజయవాడ తరలిన వ్యాపారులు
ABN , First Publish Date - 2022-08-18T04:53:23+05:30 IST
విజయవాడలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యాపారుల ఆత్మీయ సమావేశానికి వాణిజ్య విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఇంకొల్లుకు చెందిన పాలేరు రామకృష్ణ ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గ స్థాయిలో వ్యాపారులు తరలి వెళ్లారు. అంతకు ముందు ఇంకొల్లులో ర్యాలీతో ప్రారంభించి సుమారు 15 వాహనాలలో బయలుదేరారు.
ఇంకొల్లు, ఆగస్టు17: విజయవాడలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యాపారుల ఆత్మీయ సమావేశానికి వాణిజ్య విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఇంకొల్లుకు చెందిన పాలేరు రామకృష్ణ ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గ స్థాయిలో వ్యాపారులు తరలి వెళ్లారు. అంతకు ముందు ఇంకొల్లులో ర్యాలీతో ప్రారంభించి సుమారు 15 వాహనాలలో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో యునియన్ అధ్యక్షుడు ఎస్కె.నూర్బాషా, టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి రవిచంద్ర, కె.నరసింహారావు, ఖాజావలి, బ్రహ్మం,కోటేశ్వరరావు, వెంకట్రావు, రాజేష్, దేవతోటి నాగరాజు, వ్యాపారులు పాల్గొన్నారు.