ప్రజలను కొల్లగొడుతున్న వైసీపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-08-18T04:51:15+05:30 IST
నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలను కొల్లగొడుతూ సంక్షేమ పఽథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని తెలుగుదేశంపార్టీ పర్చూరు నియోజకవర్గ రైతుసంఘం అధ్యక్షుడు అప్పలనేని నరేంద్రబాబు విమర్శించారు. పర్చూరు మండల పరిధిలోని వీరన్నపాలెం గ్రామంలో బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు షేక్ షంషుద్ధీన్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
బాదుడే బాదుడులో టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు
వీరన్నపాలెం(పర్చూరు), అగస్టు 17: నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలను కొల్లగొడుతూ సంక్షేమ పఽథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని తెలుగుదేశంపార్టీ పర్చూరు నియోజకవర్గ రైతుసంఘం అధ్యక్షుడు అప్పలనేని నరేంద్రబాబు విమర్శించారు. పర్చూరు మండల పరిధిలోని వీరన్నపాలెం గ్రామంలో బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు షేక్ షంషుద్ధీన్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుసంఘం నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు రైతులను విస్మరించిందన్నారు. రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి మాట్లాడుతూ నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ కోట్లరూపాయల ప్రజాధనాన్ని జగన్ కూడకట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇంటింటా తిరిగి ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు బేతపూడి సురేష్, పుల్లెల పద్మావతి, కాపు రవిచంద్ర, అడ్డగడ సాంబశివరావు, కొరిటాల సురేష్, పఠాన్ సమీర్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ ఫజల్, గిరిబాబు, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, దాసి కిరణ్, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.