జీతాల కోసం పారిశుధ్య కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2022-12-06T22:20:16+05:30 IST
జీతాల కోసం పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. నెలలు గడిచినా జీతాలు ఇవ్వలేదు. మా కుటుంబాలు ఎలా జరగాలి?, ప్రతి సారి అడుగుతున్నా చూద్దాం, చేద్దాం అంటున్నారు తప్ప జీతాలు ఇవ్వడం లేదంటూ పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముండ్లమూరు, డిసెంబరు 6 : జీతాల కోసం పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. నెలలు గడిచినా జీతాలు ఇవ్వలేదు. మా కుటుంబాలు ఎలా జరగాలి?, ప్రతి సారి అడుగుతున్నా చూద్దాం, చేద్దాం అంటున్నారు తప్ప జీతాలు ఇవ్వడం లేదంటూ పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు సీఐటీయూ నాయకుడు బోడపాటి హనుమంతరావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు ఏడాది నుంచి జీతాలు ఇ వ్వడంలేదన్నారు. వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈవో ఆర్డీ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరిస్తామని ఓబులేసు హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించారు.