నాడు-నేడు పనుల్లో నాణ్యత పాటించాలి
ABN , First Publish Date - 2022-11-24T22:54:59+05:30 IST
నాడు- నేడు ద్వా రా పాఠశాలల అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్ర మాణాలు పాటించాలని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు.
కనిగిరి, నవంబరు 24 : నాడు- నేడు ద్వా రా పాఠశాలల అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్ర మాణాలు పాటించాలని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. పట్టణ సమీపంలోని శంఖవరం గ్రామ పరిధిలోని కస్తూర్బా పాఠ శాలలో జరుగుతున్న పనులను ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దర్ పుల్లారావుతో కలిసి జేసీ పరిశీలించారు. పాఠశాలల్లో అదనపు, నూతన భవనాల నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పా రు. ల్యాబ్, ఆట స్థలం, పాత్వే ఉండాలని జేసీ సూచించారు. అదేవిధంగా పాఠశాల ప్రాం గణంలో పై నుంచి వెళ్తున్న విద్యుత్ సరఫరా లైను అలైన్మెంట్ను మార్చాలని విద్యుత్ అధి కారులను జేసీ ఆదేశించారు. టాయిలెట్స్లలో ఫ్లష్లు ఏర్పాటు చేయాలని, నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. అనం తరం విధ్యార్థినులతో మాట్లాడిన జేసీ భోజన వసతి, హాస్టల్ పనితీరుపై విచారించారు. పు స్తక పఠనం అలవాటు చేసుకోవాలని వారికి సూచించారు. తొలుత మండలంలోని చిన అల వలపాడువద్ద బెంగళూరు - కడప - విజయ వాడ ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటు కోసం అవస రమైన భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. హైవే ఏర్పాటులో భూములు కో ల్పోయే రైతులకు నష్టపరిహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. అందుకు రైతులు అంగీకారాన్ని తెలిపి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారా యణరావు, చైర్మన్ గఫార్, ఎంఈవో ప్రసాద రావు, విద్యుత్ శాఖ డీఈఈ నాగేశ్వరరావు, హౌసింగ్ డీఈ, ఏఈలు పాల్గొన్నారు.