మెట్టకు పైర్లకు జీవం

ABN , First Publish Date - 2022-09-09T05:01:53+05:30 IST

జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. మెట్టపైర్లకు జీవం పోసింది. సాదారణంగా ఈనెలలో జిల్లాలో వర్షాలు అధికంగానే పడుతుంటాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ఆ ప్రభావం జిల్లాపైనా కనిపించింది. బుధవారం రాత్రి నుంచి అత్యధిక ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.

మెట్టకు పైర్లకు జీవం
దోర్నాల ప్రాంతంలో వర్షాలకు కళకళలాడుతున్న పత్తి పైరు

జిల్లావ్యాప్తంగా జల్లులు

మరో రెండు రోజులు కురిసే అవకాశం

ఒంగోలు, సెప్టెంబరు 8 (ఆంరఽధజ్యోతి) : జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. మెట్టపైర్లకు జీవం పోసింది. సాదారణంగా ఈనెలలో జిల్లాలో వర్షాలు అధికంగానే పడుతుంటాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ఆ ప్రభావం జిల్లాపైనా కనిపించింది. బుధవారం రాత్రి నుంచి అత్యధిక ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొండపిలో అత్యధికంగా 25.50 మి.మీ వర్షపాతం నమోదైంది. కనిగిరిలో 18.50, పి.సి.పల్లిలో 18.25, మర్రిపూడిలో 18.0, జరుగుమల్లిలో 17.50, తాళ్లూరులో 17.0 మి.మీ కురిసింది. ఒంగోలుతో సహా ఇతరచోట్ల జల్లులు పడ్డాయి. తెల్లవారుజాము నుంచే వర్షం ప్రారంభవడంతో జనజీవనానికి ఇబ్బంది ఏర్పడింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, చిరుద్యోగులు ఇక్కట్లు పడ్డారు. తాజా వర్షాలు మెట్ట పంటలకు ఉపకరించనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సుమారు లక్షా ఐదువేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగు చేయగా వాటిలో 90శాతం వరకూ పొలంలో ఉన్నాయి. వాటికి ఈ వర్షాలు ఉపకరించనున్నాయి. ప్రత్యేకించి దాదాపు 39వేల హెక్టార్లలో వేసిన పత్తి, మరో 38వేల హెక్టార్లలో వేసిన కంది పంటలకు మేలు చేయనున్నాయి. మరోరెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Updated Date - 2022-09-09T05:01:53+05:30 IST