ఘనంగా స్వాతి షాపింగ్‌మాల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-10T00:23:17+05:30 IST

ఒంగోలు నగరం కర్నూలురోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. షాపింగ్‌మాల్‌ను సినీతారలు మెహ్రీన్‌ కౌర్‌, అనసూ య భరద్వాజ్‌లు ప్రారంభించారు.

 ఘనంగా స్వాతి షాపింగ్‌మాల్‌ ప్రారంభం

హాజరైన మెహ్రీన్‌కౌర్‌, అనసూయ

ఒంగోలు(కల్చరల్‌), డిసెంబరు 9: ఒంగోలు నగరం కర్నూలురోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. షాపింగ్‌మాల్‌ను సినీతారలు మెహ్రీన్‌ కౌర్‌, అనసూ య భరద్వాజ్‌లు ప్రారంభించారు. వారిని చేసేందుకు ప్రజలు మాల్‌ వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అనుసూయ మాట్లాడుతూ ఒంగోలు లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్‌మాల్‌లో అందుబాటులో ధర లతో పలురకాల మోడల్స్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం మాల్‌ ఎండీ సాత్విక్‌ మాట్లాడుతూ తొలుత చీరాలలో వ్యాపార కా ర్యకలాపాలు ప్రారంభించిన అనంతరం గుంటూరు, సర్సరావుపేటలకు విస్తరి ంచామన్నారు. ఇప్పుడు ఒంగోలులులో బ్రాంచిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను కొనుగోలుదారులకు అందించాలన్న దే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

Updated Date - 2022-12-10T00:23:22+05:30 IST