ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2022-11-30T00:58:44+05:30 IST

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు క్రీడామైదానంలో పోటీలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ జి.అర్చన ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 400మందికిపైగా దివ్యాంగులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడా పోటీలు

400మందికిపైగా హాజరు

ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 29: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు క్రీడామైదానంలో పోటీలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ జి.అర్చన ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 400మందికిపైగా దివ్యాంగులు పాల్గొన్నారు. పరుగుపందెం, చెస్‌, లాంగ్‌జంప్‌, షాట్‌ఫుట్‌ తదితర పోటీలను నిర్వహించారు. స్ఫూర్తి వెల్ఫేర్‌ సొసైటీ, ఎస్‌కేఆర్‌ చెవిటి, మూగపిల్లల పాఠశాల నిర్వాహకులు కాశిరెడ్డి, అంజిరెడ్డి పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సూర్యశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. వారితోపాటు జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు భోజన సౌకర్యం కల్పించాయి. పోటీలలో విజేతలకు దివ్యాంగుల దినోత్సవమైన డిసెంబరు 3న బహుమతులు ప్రదానం చేస్తామని ఏడీ అర్చన తెలిపారు.

Updated Date - 2022-11-30T00:58:45+05:30 IST