నష్ట పరిహారానికి మిర్చి రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-01-04T05:17:21+05:30 IST

తెగుళ్లతో పంట నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదు కోవాలని ఏపీ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకట రామిరెడ్డి డి మాండ్‌ చేశారు.

నష్ట పరిహారానికి మిర్చి రైతుల ధర్నా


మార్కాపురం, జనవరి 3: తెగుళ్లతో పంట నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదు కోవాలని ఏపీ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకట రామిరెడ్డి డి మాండ్‌ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఆవరణంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ర్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి ప్రాంతాలలో మిరప పంట లక్ష ఎకరాల్లో సా గుచేశారన్నారు. రైతులు అప్పులు చేసి లక్షలా దిరూపాయలు పెట్టుబడులు పెట్టారన్నారు. అధికార వైసీపీ ప్రకృత్తి విపత్తులకు పంట నష్టపరిహారం అంచనా వేయలేదన్నారు. ఇటీ వల గుంటూరు లాం ఫాం, కేంద్ర ప్రభుత్వ శా స్త్రవేత్తలు కృష్ణ, గుంటూరు జిల్లాలో పంట న ష్టాలను పరిశీలించేరే తప్ప, ప్రకాశం జిల్లాలో పర్యటించలేదన్నారు. తెగుళ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఎకరాకు లక్ష రూ పాయలు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతులు దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి, యేరువ పాపిరెడ్డి,  పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-04T05:17:21+05:30 IST