వికేంద్రీకరణతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2022-04-05T06:24:02+05:30 IST
అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సుసాధ్యం అని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.పట్టణంలోని బీవీఎ్సఆర్ కల్యాణమండపం ఆవరణలో జిల్లాల వికేంద్రీకరణ చేసిన సందర్భంగా కృతజ్ఞతా సభను సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపీపీ,జడ్పీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్యనాయకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సుధాకర్బాబుతో కలిసి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు జిల్లాల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎంకే దక్కిందన్నారు.
చీమకుర్తి,ఏప్రిల్4 : అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సుసాధ్యం అని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.పట్టణంలోని బీవీఎ్సఆర్ కల్యాణమండపం ఆవరణలో జిల్లాల వికేంద్రీకరణ చేసిన సందర్భంగా కృతజ్ఞతా సభను సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపీపీ,జడ్పీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్యనాయకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సుధాకర్బాబుతో కలిసి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు జిల్లాల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు యద్దనపూడి శ్రీనివాసరావు, విజయకుమారి, వాకా అరుణ, జడ్పీటీసీలు వేమా శ్రీనివాసరావు, దుంపా రమణమ్మ, చైర్మన్ చల్లా అంకులు, కన్వీనర్లు దాసరి లక్ష్మీనారాయణ,క్రిస్టిపాటి శేఖరరెడ్డి, దాసరి లక్ష్మీనారాయణ, దుంపా చెంచిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మేడగం రామకృష్ణారెడ్డి, దుంపా యలమందారెడ్డి, నారా విజయలక్ష్మి, కొమ్మూరి సుధాకర్, జేఏసీ అధ్యక్షుడు దూపాటి సత్యం, బ్రహ్మనందరెడ్డి, మారెళ్ల బంగారుబాబు, కోయి హనుమయ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.