వైసీపీ బలోపేతం చేసేందుకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-12-10T00:21:01+05:30 IST

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని వైసీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయ పరిధిలో ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారన్నారు.

వైసీపీ బలోపేతం చేసేందుకు శ్రీకారం

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు

రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎమ్మెల్యే బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 9 : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని వైసీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయ పరిధిలో ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారన్నారు. నగరంలోని 34వ డివిజన్‌లో గడపగడపకు మనంప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 16 నెలల సమయం ఉన్నందున జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి పార్టీ అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లతో ప్రత్యేక సమా వేశం నిర్వహించారన్నారు. సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామ కాన్ని ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:21:03+05:30 IST