AP News: వరద రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు: మంత్రి సురేష్
ABN , First Publish Date - 2022-07-24T20:08:07+05:30 IST
పోలవరం (Polavaram) ఎత్తు, ముంపు గ్రామాల వ్యవహారం ముగిసిన అధ్యాయమని మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: పోలవరం (Polavaram) ఎత్తు, ముంపు గ్రామాల వ్యవహారం ముగిసిన అధ్యాయమని మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని పోని వివాదాలకు తెరలేపడం సరికాదన్నారు. రాజకీయంగా అక్కడ ప్రతిపక్షాలతో పోటీపడలేకే.. వరద (flood) రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇవి వారి స్వార్థపూరిత మాటలు తప్ప వేరొకటి కాదన్నారు. తాము ఎక్కడా తమ పరిధి దాటలేదని ఆదిమూలపు సురేష్ తెలిపారు.