విశాఖకు తరలిస్తే సీమకే అధిక నష్టం: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2022-10-11T09:30:19+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘విభజన చట్టం ప్రకా
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘విభజన చట్టం ప్రకారం రాయలసీమకు కేంద్రం నుంచి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని రప్పించడంలో, కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ను సాధించడంలో విఫలమయ్యారని తెలిపారు. రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే దూరం కారణంగా ఎక్కువగా నష్టపోయేది రాయలసీమవాసులేనని స్పష్టం చేశారు.