Palnadu: అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు

ABN , First Publish Date - 2022-07-05T17:56:49+05:30 IST

జిల్లాలోని దాచేపల్లి మండలం పొందుగుల వద్ద మంగళవారం బస్సు ప్రమాదం జరిగింది.

Palnadu: అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు

పల్నాడు: జిల్లాలోని దాచేపల్లి మండలం పొందుగుల వద్ద మంగళవారం బస్సు ప్రమాదం జరిగింది. అద్దంకి - నార్కెట్పల్లి హైవేపై ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితం బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. 

Updated Date - 2022-07-05T17:56:49+05:30 IST