Palnadu: రెచ్చిపోయిన వైసీపీ నేత కుమారుడు.. అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్
ABN , First Publish Date - 2022-09-06T23:15:45+05:30 IST
ముప్పాళ్ళ సచివాలయంలో వైసీపీ వార్డు మెంబర్ కుమారుడు కోటిరెడ్డి వీరంగం సృష్టించారు. సచివాలయంలోకి ప్రవేశించి బీభత్సం చేశాడు. సిబ్బందిపై కేకలు వేస్తూ ...
పల్నాడు (Palnadu): ముప్పాళ్ళ సచివాలయం (Muppalla Secretariat)లో వైసీపీ వార్డు మెంబర్ కుమారుడు కోటిరెడ్డి (Ycp ward member son Kotireddy) వీరంగం సృష్టించారు. సచివాలయంలోకి ప్రవేశించి బీభత్సం చేశాడు. సిబ్బందిపై కేకలు వేస్తూ రెండు కంప్యూటర్లతో పాటు ప్రింటర్ను ధ్వంసం చేశాడు. అంతేకాదు సచివాలయ సిబ్బందిపైనే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అక్కడ కూడా రెచ్చిపోయాడు. మహిళా కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించాడు. రూల్స్ తెలుసా?.. మీడియాను పిలుస్తానంటూ బెదిరించారు. దీంతో మహిళా కానిస్టేబుల్ ప్రతిఘటించారు. కోటిరెడ్డిని అదుపు చేసి సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.