AP News: కోడెల వర్ధంతి కార్యక్రమాలకు అడ్డంకులు
ABN , First Publish Date - 2022-09-16T15:47:52+05:30 IST
జిల్లాలోని సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మూడవ వర్ధంతి కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (Kodela shiva prasad) మూడవ వర్ధంతి కార్యక్రమాలకు పోలీసులు (Police) అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోడెల వర్ధంతి సందర్భంగా తాలూకా సెంటర్లో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు టీడీపీ (TDP) సన్నాహాలు చేస్తోంది. అయితే మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసే ప్రదేశంలో లారీ, పెట్రోలింగ్ వెహికల్ను పోలీసులు అడ్డుపెట్టారు. టెంట్ సామాన్లు , కుర్చీలను వెనుకకు పంపించేశారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నాని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలను టీడీపీ నాయకులు (TDP Leaders) తీవ్రంగా ఖండించారు.