Palnadu..: పాముకాటుకు 4వ తరగతి విద్యార్థిని మృతి
ABN , First Publish Date - 2022-09-12T16:25:55+05:30 IST
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చింతపల్లిలో గ్రామంలో ఇంటివద్ద ఆరుబయట ఆడుతుండగా 4వ తరగతి
Palnadu District: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చింతపల్లిలో గ్రామంలో ఇంటివద్ద ఆరుబయట ఆడుతుండగా 4వ తరగతి విద్యార్థిని గౌతమి(Student Gautami)(10)ని పాము(snake)కాటువేసింది. పాము కాటు అనంతరం చిన్నారి గట్టిగా అరవడంతో తల్లిదండ్రులు(parents) హడావుడిగా బయటికి వచ్చి గమనించారు. చిన్నారి పాము కుట్టిన్నట్లు చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ..చిన్నారి గౌతమి మార్గమధ్యలోనే మృతి చెందింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. గౌతమి మృతితో చింతపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.