వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం నశించింది

ABN , First Publish Date - 2022-09-30T03:38:41+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని మండల బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాపోరులో భాగంగా వా

వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం నశించింది
కలిగిరిలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

కలిగిరి, సెప్టెంబరు 29: వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని మండల బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాపోరులో భాగంగా వారు గురువారం మాట్లాడుతూ మోదీ ఉచిత రేషన్‌ను డిసెంబరు వరకు పొడిగించారని, కానీ రాష్ట్రప్రభుత్వం వాటిని నిరుపేదలకు పంచకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి వెంకట రంగారావు, నందనవనం ప్రభాకరరావు, మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, రోశయ్య, మల్లికార్జున, హరగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T03:38:41+05:30 IST