ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం: కాకాణి

ABN , First Publish Date - 2022-12-09T02:37:44+05:30 IST

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు.

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం: కాకాణి

నెల్లూరు (విద్య) డిసెంబరు 8: రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధాన్యం సేకరణకు ఎలాంటి లక్ష్యం లేదని రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-09T02:38:25+05:30 IST