వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
ABN , First Publish Date - 2022-09-09T03:16:47+05:30 IST
మండలంలోని జీ.చెరువుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీమాత గంగాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వే
ఉదయగిరి రూరల్, సెప్టెంబరు 8: మండలంలోని జీ.చెరువుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీమాత గంగాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వేదపండితులు అభిషేకాలు, హోమాలు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.