AP News: లోక్ సభ స్పీకర్‌ను సన్మానించిన వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2022-10-03T19:41:38+05:30 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ని ఘనంగా సన్మానించారు.

AP News: లోక్ సభ స్పీకర్‌ను సన్మానించిన వెంకయ్యనాయుడు

నెల్లూరు (Nellore): మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)ను ఘనంగా సన్మానించారు. సోమవారం నెల్లూరు, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు (Swarna Bharat Trust)లో దసరా వేడుకల్లో వెంకయ్య నాయుడు, ఓం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ సంపాదించిన దానిలో కొంత భాగం సమాజానికి ఇవ్వడం జీవితంలో భాగం కావాలని, సేవలేని జీవితం వ్యర్ధమని అన్నారు. అవినీతి, అక్రమాలపై పోరాటమే విజయదశమి అని, మన పెద్దవారు అందించిన సంస్కృతిని మనమంతా కాపాడుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు.


లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ...

సేవకి మారు పేరు వెంకయ్యనాయుడని, తనలాంటి వేల మందికి ఆయన ఆదర్శమని అన్నారు. స్పీకర్‌గా ఉన్న తనకు ఎన్నో మార్గదర్శకాలు చేశారన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో విద్యా విజ్ఞానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, పిల్లలకు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పిస్తున్నారన్నారు. తల్లిదండ్రుల మధ్య ఉంటే ఎలాంటి భద్రత ఉంటుందో.. అది స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో కనిపిస్తోందన్నారు. మహిళలు స్వశక్తితో ఎలా ఎదగాలో స్వర్ణభారత్ ట్రస్ట్ నేర్పిస్తుందని, రైతులు, పేదలు, విద్యార్థుల కొరకు శ్రమిస్తున్న వెంకయ్యనాయుడుని అభినందించాలన్నారు. ప్రధాన మంత్రి ఆత్మ నిబ్బర్ స్వర్ణభారత్ ట్రస్టులో అమలౌతుందని ఓం బిర్లా పేర్కొన్నారు.

Updated Date - 2022-10-03T19:41:38+05:30 IST