బైక్ను ఢీకొన్న గుర్తుతెలియని కారు
ABN , First Publish Date - 2022-12-06T23:04:13+05:30 IST
గుర్తు తెలియని ఒక కారు వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పల్లారపు కృష్ణయాదవ్ గాయపడ్డారు.
పొదలకూరు, డిసెంబరు 6 : గుర్తు తెలియని ఒక కారు వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పల్లారపు కృష్ణయాదవ్ గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని వరదాపురం సమీపంలో జరిగింది. బాధితుడి కథనం మేరకు మండ లంలోని తాటిపర్తి గ్రామానికి చెందిన కృష్ణయాదవ్ తన సొంత పనులపై పొదలకూరుకు బైక్పై బయలుదేరాడు. వరదాపురం సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఎర్రకారు బైక్ను ఢీకొంది. దీంతో కృష్ణయాదవ్ ఎగిరి రోడ్డు అవతల పడి స్పృహ కోల్పోయాడు. ఆయనకు రెండు మోకాళ్లు, మోచేతులు, కుడి కన్ను వద్ద గాయాలయ్యాయి. గమనించిన ఓ రైతు ఆయనను తాటిపర్తికి తీసుకెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ప్రథమ చికిత్స చేయించాడు. అనంతరం పొదలకూరు సీహెచ్సీలో మెరుగైన వైద్యం పొందారు. టీడీపీ నాయకులు మల్లికార్జుననాయుడు, బక్కయ్యనాయుడు, శ్రీనివా సులు, సందీప్లు కృష్ణయాదవ్ను పరామర్శించారు. పార్టీ కార్యక్ర మాల్లో చురుగ్గా పాల్గొంటున్న కృష్ణ యాదవ్పై అక్కసుతోనే అధికార పార్టీ నాయకులు ఇలా చేయించారనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు