టీడీపీ బలోపేతానికి మరింత కృషి
ABN , First Publish Date - 2022-09-30T03:36:36+05:30 IST
యోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ
కావలి, సెప్టెంబరు29: నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకుడు షేక్ కరీముల్లా చెప్పారు. పరిశీలకుడిగా కరీముల్లా నియమితులైన సందర్భంగా గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన నేతలతో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన్ను నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కావలిలో టీడీపీ జెండా రెపరెపలాడేలా తన వంతు సహకారం అందిస్తానన్నారు. మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ కరీముల్లాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు.