దుకాణంలో చదువులు

ABN , First Publish Date - 2022-07-18T23:53:18+05:30 IST

పాఠశాల నూతన భవనాలు నిర్మాణం పూర్తయి ప్రారంభం కాకపోవడంతో 75 మంది విద్యార్థులు రెండు దుకాణాల్లో చదువు సాగిస్తున్నారు.

దుకాణంలో చదువులు

నెల్లూరు: పాఠశాల నూతన భవనాలు నిర్మాణం పూర్తయి ప్రారంభం కాకపోవడంతో 75 మంది విద్యార్థులు రెండు దుకాణాల్లో చదువు సాగిస్తున్నారు. ఈ దుస్థితి నెల్లూరు నగర పరిధిలోని బలిజపాళెంలో నెలకొంది. ఇక్కడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల ఉంది. సొంత భవనాలు లేకపోవడంతో నాడు-నేడు పథకంలో నూతన భవనాలను నిర్మించారు. అయినా పాఠశాలను అధికారులు ప్రారంభించలేదు. దీంతో 1 నుంచి 5 తరగతులు చదువుతున్న 75 మంది విద్యార్థులు పక్కనే ఉన్న  రెండు దుకాణాల్లో కూర్చుని చదువుకుంటున్నారు. కాగా రోడ్డుపైనే ఈ దుకాణాలుండటంతో విద్యార్థులు ఎవరికీ కనపడకుండా ఉండేందుకు వారికి అడ్డంగా తెరకట్టారు. విద్యా సంవత్సరాన్ని అట్టహాసంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మాత్రం సౌకర్యాలు కల్పించకపోవడం గమనార్హం.

Updated Date - 2022-07-18T23:53:18+05:30 IST