ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణకు ప్రతిపాదనలు
ABN , First Publish Date - 2022-07-19T04:10:37+05:30 IST
కావలి ఆర్టీసీ బస్టాండ్ను ఆధునికీకరించాలన్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి సూచనల మేరకు సోమవారం ఆర్టీసీ యాజమాన్యం నెల్లూరు నుంచి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని కావలికి పంపింది.
పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు
కావలి, జూలై 18: కావలి ఆర్టీసీ బస్టాండ్ను ఆధునికీకరించాలన్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి సూచనల మేరకు సోమవారం ఆర్టీసీ యాజమాన్యం నెల్లూరు నుంచి ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని కావలికి పంపింది. నెల్లూరుజోన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కే. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆ బృందం బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించి ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా కావలి డిపో మేనేజరు రాపూరు శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు నుంచి వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు అభివృద్ధి చేయవల్సిన పనులను గుర్తించారని, త్వరలో అంచనాలను సిద్ధం చేస్తారన్నారు. సంస్థ నిధులతో పాటు ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో బస్టాండ్ ఆధునీకరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ వై.సుభూషణం, ఏటీఎం దివ్యకామాక్షి, అసిస్టెంట్ మేనేజరు ట్రాపిక్ కేవీఆర్ బాబు, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.రామకృష్ణ, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ డీ.రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.