పాత చెక్‌పోస్టు నివాసితులకు పునరావాసం

ABN , First Publish Date - 2022-09-18T05:24:51+05:30 IST

పెన్నా బ్యారేజీ నుంచి పాత చెక్‌పోస్టు వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసితులను తొలగించి పునరావాసం కల్పించి ఇళ్ల పట్టాలు ఇస్తామని నగర ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

పాత చెక్‌పోస్టు నివాసితులకు పునరావాసం

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

నెల్లూరు (జడ్పీ) సెప్టెంబరు 17 : పెన్నా బ్యారేజీ నుంచి పాత చెక్‌పోస్టు వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసితులను తొలగించి పునరావాసం కల్పించి ఇళ్ల పట్టాలు ఇస్తామని నగర ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పెన్నా బ్యారేజీ ప్రాంతాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నా బ్యారేజీ నుంచి పాత చెక్‌పోస్టు ప్రాంతం వరకు 40 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయడంతోపాట స్థానికంగా పార్కులను నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాం తాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుం టున్నామన్నారు. రోడ్డుకు సంబంధించిన పనులు పది రోజుల్లో ప్రారంభి స్తామని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో తిక్కన పార్కును రూ.కోటి తో అభివృద్ధి చేశామని చెప్పారు. బ్యారేజీ వద్దకు ప్రజలు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారని, నీటి ప్రవాహం ఉన్నందున ప్రమాదాలు జరగ కుండా ప్రటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. 

Updated Date - 2022-09-18T05:24:51+05:30 IST