ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సరికొత్త ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2022-04-24T19:23:34+05:30 IST

నెల్లూరు జిల్లా: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సరికొత్త ప్రారంభోత్సవం చేశారు.

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సరికొత్త ప్రారంభోత్సవం

నెల్లూరు జిల్లా: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సరికొత్త ప్రారంభోత్సవం చేశారు. వైసీపీ కార్యాలయంలో కుర్చీలు, సోఫాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్చీలు, సోఫాలకు రిబ్బన్ కట్ చేయడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తున్నారు. సీఎం జగన్ ఎలాగూ అభివృద్ది పనులకు రిబ్బన్ కట్ చేసే అవకాశం ఇవ్వడంలేదని, ఇలా కుర్చీలు, సోఫాలకు రిబ్బన్ కట్ చేయిస్తున్నారని జోకులు వేసుకుంటున్నారు. 

Updated Date - 2022-04-24T19:23:34+05:30 IST