22 నాటికి భూహక్కు పత్రాల సిద్ధం
ABN , First Publish Date - 2022-10-09T05:04:42+05:30 IST
జిల్లాలో రీ సర్వే పూర్తయిన 118 గ్రామాలకు సంబంధించిన భూ హక్కు పత్రాలను ఈ నెల 22 నాటికి సిద్ధం అవుతాయని జేసీ కూర్మనాఽథ్ తెలిపారు.
జేసీ కలెక్టర్ కూర్మనాథ్
పొదలకూరు, అక్టోబరు 8 : జిల్లాలో రీ సర్వే పూర్తయిన 118 గ్రామాలకు సంబంధించిన భూ హక్కు పత్రాలను ఈ నెల 22 నాటికి సిద్ధం అవుతాయని జేసీ కూర్మనాఽథ్ తెలిపారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శనివారం ఆయన రెండో విడత రీ సర్వే గ్రామాల్లో పని తీరుపై రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ సమగ్ర వివరాలతో భూహక్కు పత్రాలను రైతులకు అందిస్తామన్నారు. అలాగే ప్రతి ఓటరు తన ఓటు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన 113 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయన్నారు. మండలంలో మొదటి విడత భూ రీ సర్వేలో భాగంగా నందివాయి, మొగళ్లూరు, అంకుపల్లి, బత్తులపల్లి, రెండో విడత గురువా యుపా లెం, చాటగొట్ల, మర్రిపల్లి, ఊట్లపాలెం, ఊచపల్లి, పార్లపల్లి, వెలికంటిపాలెం గ్రామాల్లో భూసర్వే జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు ఐఎస్ ప్రసాద్, డీటీ శాంతి స్వరూప్, ఆర్ఐ నవీన్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.