ముత్యాలమ్మ జాతరను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-03-19T03:57:28+05:30 IST
తూర్పుకనుపూరులో ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ వేమారెడ్డి మురళీమోహన్రెడ్డి కోరారు.
చిల్లకూరు, మార్చి 18: తూర్పుకనుపూరులో ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ వేమారెడ్డి మురళీమోహన్రెడ్డి కోరారు. శుక్రవారం ఆలయంలో జాతరకు సంబంధించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వసతులు కల్పించామన్నారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈవో కోవూరు జనార్దన్రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.